
- పర్మిషన్ ఇస్తే చాలు.. క్లాసులు స్టార్ట్ చేస్తామంటున్న వీసీ
- బిల్డింగ్ రెడీగా ఉందంటూ రిపోర్ట్
- విద్యాకమిషన్, ఉన్నత విద్యామండలి చైర్మన్లకు విన్నపాలు
నిజామాబాద్, వెలుగు: తెలంగాణ వర్సిటీలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలపడుతోంది. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహించేందుకు అన్ని వసతులు, అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ విషయంలో చొరవ చూపాలని శనివారం వర్సిటీని విజిట్చేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని ప్రొఫెసర్లు, స్టూడెంట్స్కోరారు. గత నెల17న ఇక్కడకు వచ్చిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కూడా ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరగా.. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
నిజామాబాద్రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కూడా ముఖ్యమంత్రిని లేఖ రాశారు. పర్మిషన్ ఇచ్చిన వెంటనే కాలేజీ ప్రారంభించేందుకు రెడీగా ఉన్నట్టు వీసీ యాదగిరిరావు ఇదివరకే ప్రభుత్వానికి నివేదించారు. ఇజనీరింగ్ కౌన్సిలింగ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.
ఆరు కోర్సుల నుంచి 32 వరకు..
ఉస్మానియా, కాకతీయ తరువాత మూడో పెద్ద యూనివర్సిటీగా గుర్తింపు పొందిన టీయూ.. యూజీసీ న్యాక్ 'బీ' గ్రేడ్ హోదా పొందింది. ఈ నెల 16న వర్సిటీ కాన్వొకేషన్కు హాజరైన గవర్నర్జిష్ణుదేవ్వర్మ టీయూ గొప్పస్థానాన్ని గురించి మాట్లాడారు. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన టీయూలో ప్రస్తుతం 32 కోర్సులు ఉన్నాయి. బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ వంటి 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా నడుస్తున్నాయి. వర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్జిల్లాల్లో 320 డిగ్రీ, 81 పీజీ కాలేజీలు ఉండగా 51 వేల స్టూడెంట్స్చదువుకుంటున్నారు. క్యాంపస్ విద్యార్థుల సంఖ్య 2 వేల కన్నా ఎక్కువే. ఈ రెండు జిల్లాల నుంచి ఏటా 55 వేల మంది స్టూడెంట్స్ ఇంటర్ పూర్తి చేస్తున్నారు.
వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్లోనే చేరుతున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా ఒక్క టీయూలోనే లేదు. గవర్నమెంట్ పర్మిషన్ఇస్తే కాలేజీ ఏర్పాటు చేయడానికిజేఎన్టీయూ అధికారులు రెండేండ్ల కిందటే సంసిద్ధత తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సొంత సెగ్మెంట్లోని కోస్గి పాలిటెక్నిక్కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, మహబూబ్నగర్, ఖమ్మంలో కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులిచ్చారు. దీంతో టీయూలోనూ కాలేజీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ప్రభుత్వం అనుమతిస్తే వర్సిటీలో రూ.18 కోట్లతో నిర్మించిన సైన్స్ బిల్డింగ్లో కాలేజీని ప్రారంభిస్తామని వీసీ యాదగిరిరావు చెప్తున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేట్ అయినా నిర్వహణకు ఇబ్బందిలేదంటున్నారు. ఈ నెల 23న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్చైర్మన్ బాలకృష్ణారెడ్డి వర్సిటీకి రానున్నారు. ఆయనకు డిటైల్డ్ రిపోర్ట్ ఇవ్వడానికి వర్సిటీ అధికారులు రెడీ అవుతున్నారు. వర్సిటీలో ఫార్మసీ, బీపీఈడీ, ఎంఈడీ కాలేజీలు ఏర్పాటు చేయాలని కూడా స్టూడెంట్స్ కోరుతున్నారు.