మే నెల జీఎస్‌‌టీ వసూళ్లు  రూ. 1.02 లక్షల కోట్లు

మే నెల జీఎస్‌‌టీ వసూళ్లు  రూ. 1.02 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్‌‌‌‌టీ వసూళ్లు మే నెలలో రూ. 1,02,709 కోట్లకి తగ్గాయి. ఈ వసూళ్లు రూ. లక్ష కోట్లను దాటడం వరసగా ఇది ఎనిమిదో నెల. అయితే, ఏప్రిల్‌‌‌‌లోని రూ. 1.41 లక్షల కోట్లతో పోలిస్తే మే నెల వసూళ్లు బాగా తగ్గినట్లే. ఆ నెలలో దేశంలోని చాలా రాష్ట్రాలలో లాక్​డౌన్లు అమలవడమే జీఎస్‌‌‌‌టీ వసూళ్లు పడిపోవడానికి కారణమని చెబుతున్నారు. మే 2020 తో పోలిస్తే జీఎస్‌‌‌‌టీ వసూళ్లు 65 శాతం ఎక్కువయ్యాయి. ఇంపోర్ట్స్​పై వచ్చే వసూళ్లు మే నెలలో 56 శాతం పెరిగాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్‌‌‌‌టీ రూ. 17,592 కోట్లు, ఎస్​జీఎస్‌‌‌‌టీ రూ. 22,653 కోట్లు, ఐజీఎస్‌‌‌‌టీ రూ. 53,199 కోట్లు, సెస్​ రూ. 9,265 కోట్లు ఉన్నట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్​ ఉన్న బిజినెస్‌‌‌‌లకు జీఎస్‌‌‌‌టీ రిటర్న్ ఫైలింగ్​కు జులై వరకు గడువుండటంతో అసలైన​ వసూళ్లు  ఇంకా కొంత పెరుగుతాయని మినిస్ట్రీ పేర్కొంది. లాక్​డౌన్‌‌‌‌ కారణంగా రిటర్న్​ఫైలింగ్​ గడువును గవర్నమెంట్ పొడిగించింది.