100 ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలపై జీఎస్​టీ నజర్

100 ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలపై జీఎస్​టీ నజర్
  • డబ్బు  లావాదేవీలు జరిపే ..కంపెనీలే టార్గెట్​

న్యూఢిల్లీ: జీఎస్​టీ ఎగవేసినట్లు అనుమానిస్తున్న 100 ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలపై జీఎస్​టీ అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఆన్​లైన్​ గేమింగ్​ ఫెడరేషన్స్​లో 100 కి పైగా ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలు రిజిస్టరయ్యాయి. ఈ కంపెనీల యాక్టివిటీస్​పై ఫోకస్​ పెడుతున్నామని, జీఎస్టీ ఎగవేత ఏ మేరకు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని జీఎస్​టీ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు వెల్లడించారు. గేమింగ్​ యాక్టివిటీస్​లో  డబ్బు లావాదేవీలు సాగించే ఆన్​లైన్​ గేమింగ్​కంపెనీలపైనే నజర్​ పెడుతున్నట్లు చెప్పారు. ఈ వంద కంపెనీలలో అన్ని కంపెనీలూ రియల్​మనీ ట్రాన్సాక్షన్లలో పాల్గొనడం లేదని, అలాంటి కంపెనీలను పట్టించుకోమని పేర్కొన్నారు. కిందటేడాది సెప్టెంబర్​లో గేమ్స్​క్రాఫ్ట్​ అనే ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీకి రూ. 21 వేల కోట్ల జీఎస్​టీ చెల్లించమంటూ జీఎస్​టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాంతో ఆ కంపెనీ హైకోర్టులో సవాలు చేసుకుంది.

ఆ తర్వాత హైకోర్టు కంపెనీకి అనుకూలంగా స్టే ఇచ్చింది. ఈ స్టేను పట్టించుకోకుండా అధికారులు అదే రోజున 28 శాతం చొప్పున జీఎస్​టీ చెల్లించాల్సిందిగా మరోసారి నోటీసులు ఇచ్చినట్లు చెబుతూ, రెండోసారి హైకోర్టు బెంచ్​ను కంపెనీ ఆశ్రయించింది. కానీ, ఆ తర్వాత సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్​టీ ఇంటెలిజెన్స్​ విభాగం కోరినట్లుగా సమాధానం ఇవ్వమంటూ గేమ్స్​క్రాఫ్ట్​ కంపెనీని సుప్రీం కోర్టు ఆదేశించింది.