గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ రఘు శర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. "రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనూహ్య ఓటమికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాను. పార్టీ ఇన్ఛార్జ్గా నా రాజీనామాను దయచేసి ఆమోదించండి" అని లేఖలో పేర్కొన్నారు.
ఇదిలావుండగా గుజరాత్లో బీజేపీ అఖండ విజయం సాదించింది. 158 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించగా, కాంగ్రెస్ 16 స్థానాలకే పరిమితమైంది. ఆప్ 5, ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నారు. మరోవైపు హిమాచల్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్ కు 40 సీట్లు రాగా, బీజేపీకి 25 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆప్ ఖాతా తెరువకపోగా ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు.