సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో గుజరాత్‌ సీఎం

సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో గుజరాత్‌ సీఎం
  • తనతో భేటీ అయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు
  • కరోనా పాజిటివ్‌ రావడంతో

అహ్మదాబాద్‌: కరోనా లక్షణాలు ఉన్నా.. రిజల్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా ప్రతి ఒక్కరు కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని అధికారులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. కానీ గుజరాత్‌లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాత్రం వాటిని పాటించలేదు. కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్‌కు శాంపిల్స్‌ పంపిన ఎమ్మెల్యే రిజల్ట్‌ రాకముందే నియోజవర్గంలో పర్యటించారు. అంతే కాకుండా మినిస్టర్లు, సీఎంతో మీటింగ్‌కు కూడా అటెండ్‌ అయ్యాడు. మంగళవారం ఉదయం గుజరాత్‌ చీఫ్‌ మినిస్టర్‌‌తో భేటీ అయిన ఎమ్మెల్యేకు.. సాయంత్రానికి కరోనా పాజిటివ్‌ అని రిజల్ట్‌ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆయన ఎవరితో కాంటాక్ట్‌ అయ్యారని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు, అంతే కాకుండా విజయ్‌ రూపానీ కూడా సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. గుజారత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ ఖేద్వాలాకు కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరం వస్తుండటం, కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన టెస్ట్‌లు చేయించుకున్నారు. ఆ తర్వాత క్వారంటైన్‌లోకి ఉండకుండా.. టెస్ట్‌ రిజల్ట్‌ తేలకముందే నియోజకవర్గంలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. అంతే కాకుండా.. సీఎంతో, రాష్ట్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఎమ్మెల్యే ను గాంధీనగర్‌‌ ఎస్వీపీ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఎంత మందితో కాంటాక్ట్‌ అయ్యారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని, దానిపై కసరత్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. సీఎంతో మీటింగ్‌లో అందరూ సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించారని, కానీ ముందు జాగ్రత్త చర్యగా ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లారని అన్నారు.