గుంటూరు జిల్లా: లేడీస్​ హాస్టల్లో సీసీ కెమెరాల కలకలం.. హాస్టల్​ నిర్వాహకులపై కేసు నమోదు

గుంటూరు జిల్లా:  లేడీస్​ హాస్టల్లో సీసీ కెమెరాల కలకలం.. హాస్టల్​ నిర్వాహకులపై కేసు నమోదు

లేడీస్​ హాస్టల్స్​ విషయంలో ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. ఎంతమంది అధికారులు తనిఖీ చేస్తున్నా నిత్యం ఎక్కడొక చోట సీసీ  కెమెరాల విషయంలో గందరగోళం వార్తలు వస్తూనే ఉన్నాయి.  తాజాగా గుంటూరు జిల్లాలో ఓ హాస్టల్లో సీక్రెట్​ సీసీ కెమెరాలు కలకలం  రేపాయి.  ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...

గుంటూరు జిల్లా బ్రాడీపేట లోని శ్రీనివాస లేడీస్ హాస్టల్ లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నా రంటూ విద్యార్థినులు పోలీసులకు ఈరోజు ( మే 4)  ఫిర్యాదు చేశారు... అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్​ లు  పెట్టడం...  అబ్బాయిల్ని తీసుకుని వచ్చి లేడీస్ హాస్టల్ లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినులు చెబుతున్నారు.  విధ్యార్థినుల  కంప్లయిట్ పై  కేసు నమోదు చేసిన ​అరండల్ పేట పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. హాస్టల్​ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.