హైదరాబాద్, వెలుగు: గురుకుల ట్రైన్డ్ గ్రాడ్యుయేట్టీచర్ (టీజీటీ) ఫలితాలను గురుకుల రిక్రూట్మెంట్బోర్డు ఆదివారం విడుదల చేసింది. 27, 28వ తేదీల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనుంది. గురుకులాల్లో 4,020 పోస్టులకు గత ఏడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎంపిక చేసింది.
ఈ మేరకు ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాలను విడుదల చేసింది. ఈ నెల 27న ఇంగ్లిష్ సబ్జెక్టు అభ్యర్థులకు బంజారా భవన్లో, జనరల్సైన్స్అభ్యర్థులకు ఆదివాసీ కుమ్రం భీమ్ భవన్లో, తెలుగు, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో, ఈ నెల 28న మ్యాథ్స్అభ్యర్థులకు బంజారా భవన్ లో, హిందీ, సంస్కృతం, ఉర్దూ అభ్యర్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో, ఫిజికల్సైన్స్ అభ్యర్థులకు ఆదివాసీ కుమ్రం భీమ్ భవన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు.
