హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (నవంబర్ 17) సచివాలయంలో దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్, గిగ్ వర్కర్ల బిల్లుతో పాటు పలు అంశాలపై మంత్రి మండలి చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే:
- డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు
- ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు
- ముందు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహణ
- బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
- పాఠ్యపుస్తకాల్లో అందెశ్రీ గేయం చేర్చాలని నిర్ణయం
- అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం
- గిగ్ వర్కర్స్ బిల్లుకు ఆమోదం
- ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు దామోదర్ రెడ్డి పేరు పెట్టడానికి గ్రీన్ సిగ్నల్
- హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ పాలసీకి ఆమోదం
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయం
- సౌదీ అరేబియాలో బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయం
- మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేతో కూడిన ప్రభుత్వ బృందాన్ని సౌదీ పంపాలని నిర్ణయం
