![ఈదురు గాలుల బీభత్సం..నేల కూలిన కరెంట్ స్తంభాలు](https://static.v6velugu.com/uploads/2024/05/gusty-winds-created-havoc-in-papannapet-mandal-of-medak-district_FXwfGse3ao.jpg)
- రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డ చెట్లు
- అబ్లాపూర్లో కూలిన ఇళ్లు
పాపన్నపేట, వెలుగు : మెదక్జిల్లా పాపన్నపేట మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కుర్తివాడ గేట్నుంచి వాగు వరకు పది కరెంట్ స్తంభాలు నేలకూలాయి. వైర్లు తెగి రోడ్డు మీద పడ్డాయి. దీంతో పలు గ్రామాల పరిధిలో విద్యుత్సరఫరా నిలిచిపోయింది. కుర్తివాడ హనుమాన్ టెంపుల్వద్ద ఓ పెద్ద చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో కొంతసేపు పాపన్నపేట- టేక్మాల్రూట్లో రాకపోకలకు ఆటంకం కలిగింది.
గ్రామంలో చెట్ల కొమ్మలు విరిగి ఇండ్ల మీద పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బలమైన ఈదురు గాలులతోపాటు, భారీ వర్షం కురవడంతో అబ్లాపూర్లో వడ్ల సంగమేశ్ కు చెందిన ఇళ్లు పూర్తిగా కూలిపోయింది. ఇంట్లోని సామగ్రి ధ్వంసం కావడంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది.