రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవికి గుత్తా రాజీనామా

రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవికి గుత్తా రాజీనామా

రాష్ట్ర  రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. MLC ఎన్నికల్లో  TRSపార్టీ అభ్యర్థిగా గుత్తాను  సీఎం కేసీఆర్ ఫైనల్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనను MLC అభ్యర్థి గా ప్రకటించినందుకు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు గుత్తా. కాంగ్రెస్ తరపున అభ్యర్థులెవరూ నామినేషన్ వేసే అవకాశం లేకపోవడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికవనున్నట్లు తెలుస్తుంది.