లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నలుగురు మాజీ సీఎం లను తన కేబినెట్ లో కేంద్రమంత్రులుగా తీసుకోవాలని భావిస్తున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ లిస్టులో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఉన్నట్లుగా తెలుస్తో్ంది.
ఇందులో కుమారస్వామి మినహా మిగతా ముగ్గురు బీజేపీకి సంబంధించిన నేతలే కావడం విశేషం. కర్ణాటకలో ఇటీవల బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకోవటంతో ఆ పార్టీ నేత కుమారస్వామిని కూడా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలని బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ఈ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ హైకమాండ్ సిద్ధమవుతోంది. ఈ నెల 13న బీహార్ లో పర్యటించనున్న ప్రధాని మోదీతో ప్రచారానికి శ్రీకారం చుట్టించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీహార్లోని మొత్తం 40 స్థానాలను గెల్చుకోవడమే లక్ష్యంగా ప్రచార షెడ్యూల్ రూపొందిస్తున్నారు. బహిరంగ సభలతో పాటు రోడ్ షో, ర్యాలీలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.