
న్యూఢిల్లీ: నీటి వృథాను తగ్గించేందుకు రైల్వే శాఖ మరొ కొత్త నిర్ణయం తీసుకుంది. శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే ప్యాసింజర్లకు లీటర్ వాటర్ బాటిల్ బదులు అర్ధ లీటర్ బాటిల్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. చాలా వరకు ప్యాసింజర్లు నీటిని తాగకుండా వదిలేసి వెళ్లిపోతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
“ ఐదుగంటలు జర్నీ చేసేవారికి అర్ధ లీటర్ బాటిల్, 8.5 గంటలు జర్నీ చేసేవారికి లీటర్ బాటిల్ ఇస్తున్నాం. ఇక మీదట అందరికీ అర్ధ లీటర్ బాటిల్సే ఇస్తాం. నీటిని వృథాను తగ్గించేందుకే ఈ నిర్ణయం” అని అధికారులు చెప్పారు. ప్యాసింజర్లు కావాలంటే అదనపు బాటిల్ ఇస్తాం, కానీ డబ్బులు చెల్లించాలన్నారు.