
తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అన్ని మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒకపూట బడులను నిర్వహించాలని పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్నాహ్న భోజనం పెట్టాలని సూచించింది. టెన్త్ ఎగ్జామ్స్ ఉన్న కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని సూచించింది.