సృజనాత్మకత పెంచేందుకే సైన్స్ఫెయిర్‍లు : ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కేఆర్‍ నాగరాజు

సృజనాత్మకత పెంచేందుకే సైన్స్ఫెయిర్‍లు : ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కేఆర్‍ నాగరాజు

హనుమకొండ సిటీ, వెలుగు: దేశంలో పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడానికి సైన్స్​ ఫెయిర్‍ ఎంతగానో దోహదపడతాయని పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కేఆర్‍ నాగరాజు తెలిపారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో హనుమకొండ సెయింట్‍ పీటర్స్​ స్కూల్‍ ఆవరణలో మూడురోజుల సైన్స్​ ఫెయిర్‍ నిర్వహించగా, శనివారం హనుమకొండ డీఈవో ఎల్‍.వీ.గిరిగౌడ్‍ అధ్యక్షతన ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సైన్స్​ ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలు, రుగ్మతలు పారద్రోలాలని చెప్పారు. 

డీఈవో మాట్లాడుతూ సైన్స్​ఫెయిర్‍ను విజయవంతం చేసిన టీచర్లు, స్టూడెంట్లకు అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్​ సైన్స్​ ఫెయిర్‍ ఆఫీసర్‍ శ్రీనివాసస్వామి, సీఎంవో బద్ధం సుదర్శన్‍రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి రామ్‍ధన్‍, ఓపెన్‍ స్కూల్‍ కోఆర్డినేటర్‍ సదానందం, సెయింట్‍ పీటర్స్​ విద్యాసంస్థల అధినేత నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయిసైన్స్ ఫెయిర్ కి విద్యార్థి ఎంపిక 

ధర్మసాగర్  : హనుమకొండ జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌‌లో తాటికాయల జడ్పీహెచ్ఎస్ టెన్త్​క్లాస్​ విద్యార్థి ఆమంచ గీతిక శ్రీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. గ్రామానికి చెందిన ఆమంచ రమేశ్​ కుమార్తె గీతిక శ్రీ “మున్సిపల్ నీటి లీకేజీని స్వయంచాలకంగా గుర్తించే విధానం” అనే అంశంపై రూపొందించిన ప్రాజెక్ట్ జిల్లా స్థాయి న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందింది. ఈ ప్రాజెక్ట్‌‌కు టీచర్లు పి. దీప్తి, జి.ఉషారాణి మార్గదర్శకంలో రాష్ర్ట స్థాయికి ఎంపికైనట్లు విద్యార్థి తెలిపింది. కాగా, వారిని హెచ్​ఎం ఫాతిమా మేరీతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.