
తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే.. భారతీయ జనతా పార్టీ, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్తో సంబంధాలను తెంచుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీ రాష్ట్ర బాస్ కె అన్నామలై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. అన్నాడీఎంకే ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తమ నాయకుల పరువు తీసిందని ఆరోపించింది.
చెన్నైలో జరిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పెద్దల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి.. బీజేపీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. బీజేపీ, ఎన్డీఏలతో ఏఐఏడీఎంకే నేటి నుంచి అన్ని బంధాలను తెంచుకుందని, బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత ఏడాది కాలంగా మా మాజీ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేస్తోందని తెలిపారు. ఈ నిర్ణయంపై పార్టీ నాయకులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మూడీస్ ఆరోపణలు నిరాధారమైనవి.. ఆధార్ భద్రతపై కేంద్రం ఫైర్
"సభ్యుల అభిప్రాయం ఆధారంగానే మేము ఈ తీర్మానం చేస్తున్నాం. ఇది (మాకు) అత్యంత సంతోషకరమైన క్షణం. రాబోయే ఎన్నికలను (సొంతంగా) పార్లమెంటు లేదా అసెంబ్లీని ఎదుర్కోవడం చాలా సంతోషంగా ఉంది" అని AIAMK అధికార ప్రతినిధి శశిరేఖ అన్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. "ఇది గొప్ప నిర్ణయం. మా కార్యకర్తలు దీన్ని స్వాగతించారు. బీజేపీ పొత్తు వల్ల మైనారిటీల ఓట్లు పడలేదు. కానీ ఇప్పుడు మొత్తం 39 సీట్లు (వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో) గెలుస్తామని ఓ పార్టీ నేత అన్నారు.
AIADMK Spokesperson Sasirekha, "...Based on the members' opinion we are taking this resolution... This is the happiest moment for AIADMK. We are very happy to face the upcoming elections whether it might be Parliament or Assembly elections..." https://t.co/GiNZLJsRR7 pic.twitter.com/wkwn2QYNEI
— ANI (@ANI) September 25, 2023