
న్యూ ఇయర్ పురస్కరించుకుని భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశాడు. అనంతరం ‘మీతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ఆయనతో పాటు సోదరుడు క్రునాల్ పాండ్యా కూడా ఉన్నాడు. అమిత్ షాతో భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కొత్త ఏడాదిలో భారత్ శ్రీలంక మధ్య మూడు వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్కు హార్దిక్ను వైస్ కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. ప్రస్తుతం హార్ధిక్, క్రునాల్ పాండ్యాలు రెస్ట్ తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్ టూర్ అనంతరం హార్ధిక్, క్రునాల్ పాండ్యా చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫి అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత టీ20 జట్టుకు సారథిగా హార్దిక్ పాండ్యా ఇటీవలే ఎన్నికయ్యాడు.