అందరూ గర్వపడేలా ఆడుతం : హార్దిక్ పాండ్యా

అందరూ గర్వపడేలా ఆడుతం : హార్దిక్ పాండ్యా

ముంబై : ఈ ఐపీఎల్‌‌లో తమ ఆటతో అందరినీ గర్వపడేలా చేస్తామని ముంబై  ఇండియన్స్  కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌‌ను నడిపించిన పాండ్యా ఈ సారి ముంబై జట్టులోకి తిరిగి వచ్చాడు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్‌‌గా బాధ్యతలు చేపట్టాడు. తన ప్రయాణం మొదలైన చోటుకి తిరిగి రావడం ప్రత్యేకంగా అనిపిస్తోందన్నాడు.  

‘ఈ కలర్ జెర్సీ (ముంబై ఇండియన్స్‌‌) వేసుకుంటే నాకు స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. నా జర్నీ ఇక్కడే మొదలైంది. ఈ టీమ్‌‌లోకి తిరిగి రావడం నాకు చాలా స్పెషల్. ఈసారి అందరూ గర్వపడే విధంగా మా ఆట ఉంటుందని హామీ ఇస్తున్నా. అదే సమయంలో మా ప్రయాణాన్ని ఎవ్వరూ మర్చిపోరు’ అని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్‌‌ మీడియాలో  పోస్ట్‌‌ చేసిన ఓ వీడియోలో హార్దిక్ చెప్పాడు.