
సిద్దిపేట జిల్లా : చాకలి ఐలమ్మ స్పూర్తితోనే తెలంగాణ పోరాటం చేశామన్నారు మంత్రి హరీశ్ రావు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పోరాటపటిమ గురించి కొనియాడారు. గజ్వేల్ లో కోటీ రూపాయలతో ఐలమ్మ భవనం నిర్మిస్తామన్నారు. మరో పదిహేను రోజుల్లో రూ.40లక్షలతో ఈ భవనం చుట్టూ కాంపౌండ్ వాల్,బాత్రూం వంటి నిర్మాణాలు చేయిస్తామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమన్నారు..