పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన భారీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్' (The Raja Saab). సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే, ఈ మెగా సక్సెస్ మధ్య ఒక చేదు వార్త చిత్ర యూనిట్ను కలవరపెడుతోంది.
యూఎస్ రెస్టారెంట్లో పైరసీ కలకలం!
' ది రాజా సాబ్' చిత్రం విడుదలైన కేవలం 24 గంటల్లోనే హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయింది. అయితే ఇది ఆన్ లైన్ లో అవ్వడం ఒక ఎత్తయితే.. ఏకంగా అమెరికాలోని ఒక రెస్టారెంట్లో ఈ పైరసీ కాపీని ప్లే చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. యూఎస్లోని ఒహియో రాష్ట్రం, డబ్లిన్ నగరంలో ఉన్న ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్లో, టీవీ స్క్రీన్లపై 'ది రాజా సాబ్' పైరసీ వెర్షన్ను ప్రదర్శిస్తుంచారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ALSO READ : ముంబై నుంచి వచ్చానంటే ఛాన్సులు ఇచ్చేవారేమో?
ఒక ఎన్నారై పేజీ ద్వారా బయటకు వచ్చిన ఈ వీడియోను చూసి ప్రభాస్ అభిమానులు భగ్గుమంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా తీస్తే.. ఇలా బహిరంగంగా పైరసీని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఉదంతంపై దృష్టి సారించారు. ఇప్పటికే 'ఐబొమ్మ' (iBomma) నిర్వాహకుడు రవి ఎమండి అరెస్ట్ తర్వాత.. ఇలాంటి వెబ్సైట్లపై నిఘాను పెంచారు. అయినప్పటికీ శ్రీలంక కేంద్రంగా పనిచేస్తున్న మరికొంతమంది పైరేట్స్ ఈ సినిమాను లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
🚨 SHOCKING PIRACY
— Rathnam News (@RathnamNews) January 10, 2026
A restaurant in Ohio was caught streaming a pirated print of #TheRajaSaab on Day 1 in the USA.
It’s theft that kills overseas revenues and sabotages films from the inside.
Piracy = slow death of cinema. 🎬#TheRajaSaab #Prabhas pic.twitter.com/dQspCt1ghE
నెగటివ్ టాక్ ఉన్నా..
విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన (Mixed Reviews) వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్ ముందు అవేవీ నిలబడలేదని వసూళ్లు చెప్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.158.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది. ఇండియా నెట్ కలెక్షన్స్ దాదాపు రూ109 కోట్ల మేర వసూళ్లు సాధించినట్లు సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దర్శకుడు మారుతి ఈ చిత్రంలో ప్రభాస్ను వింటేజ్ లుక్లో ఎంతో స్టైలిష్గా చూపించారని, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ , ప్రభాస్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్గా నిలిచాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
ALSO READ : 'వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్'..
