
నేడే బడ్జెట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి హరీశ్ రావు ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో సభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత 2019 ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అదే ఏడాది సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ రెండు సార్లూ సీఎం కేసీఆరే బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. ఇక కౌన్సిల్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఈటల రాజేందర్ చదవగా, సెప్టెంబర్లో హరీశ్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు.
For More News..