
మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఒంటి చేత్తో మ్యాచును గెలిపిస్తుంది అనుకున్న టైంలో రనౌట్ అయింది. దీంతో తర్వాత వికెట్లన్నీ టపటపా రాలిపోయాయి. ఈ ఓటమితో హర్మన్ బాగా ఎమోషనల్ అయింది. కన్నీరు పెట్టుకున్న హర్మన్ ను అంజుమ్ చోప్రా ఓదార్చింది. తర్వాత మీడియా సమావేశానికి కళ్లద్దాలు పెట్టుకుని వెళ్లింది. దాని గురించి కామెంటేటర్ అడగ్గా హర్మన్ స్పందిస్తూ.. ‘మ్యాచు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. కన్నీళ్లు ఆగడం లేదు. నా కన్నీళ్లను దేశం చూడకూడదు అనుకుంటున్నాను. అందుకే కళ్లద్దాలు ధరించా. మెరుగైన ఆట తీరుతో మళ్లీ పుంజుకుంటాం. మరోసారి దేశాన్ని నిరాశపర్చబోమని మాటిస్తున్నాను. నా రనౌట్ కంటే దురదృష్టం మరొకటి ఉండదు’ అని చెప్పింది.