
మహిళల ప్రీమియర్ లీగ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. గుజరాత్ జెయింట్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ముంబై బ్యాట్స్మన్ చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 47 పరుగులు సాధించింది. అమేలియా కెర్ 45 పరుగులతో నాటౌట్గా నిలిచింది. నాట్ షివర్ 18 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు సాధించింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా 2, ఆష్లే గార్డనర్ 1, తనూజా కన్వర్ 1, జార్జియా వెర్హామ్ 1 వికెట్ తీశారు.
అదరగొట్టిన హర్మన్ ప్రీత్..
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బౌండరీలతో దుమ్మురేపింది. కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులు చేసింది. ఇందులో 14 ఫోర్లు ఉండటం విశేషం. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఎడా పెడా బౌండరీలు బాదిన హర్మన్ ప్రీత్.. 22 బంతుల్లో 11 ఫోర్లతో 51 పరుగులు చేసింది. లీగ్లో తొలి అర్ధ సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టించింది. .