
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఫార్మాట్లో 150 మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్గా చరిత్ర కెక్కింది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచులో హర్మన్ ప్రీత్ కౌర్ ఈ రికార్డు నెలకొల్పింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 148 మ్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ సుజీ బేట్స్ 143 మ్యాచ్లతో మూడో ప్లేస్లో కొనసాగుతోంది.
హర్మన్ @3000
150వ మ్యాచులో హర్మన్ ప్రీత్ కౌర్ మరో ఘనత సాధించింది. టీ20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసింది. 2009లో టీ20ల్లో అరంగేట్రం చేసిన హర్మన్ ప్రీత్ కౌర్...150 మ్యాచుల్లో 3006 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 9 అర్థసెంచరీలున్నాయి.