
న్యూఢిల్లీ: రాజ్యసభకు నలుగురు కొత్త సభ్యులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. పలువురు సభ్యుల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో వీరిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్నికం, మాజీ దౌత్యవేత్త హర్ష్వర్ధన్శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్మీనాక్షి జైన్, కేరళకు చెందిన టీచర్, సోషల్ వర్కర్ సీ సదానందన్మాస్టర్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలోనే ప్రముఖ న్యాయవాది ఉజ్వల్
దేశంలోనే ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరిగా ఉజ్వల్నికంకు పేరున్నది. ఆయన 26/11 టెర్రర్అటాక్స్తో పాటు ఉన్నతస్థాయి క్రిమినల్కేసులను వాదించారు. 2024 జనరల్ఎలక్షన్స్లో ముంబై నార్త్సెంట్రల్లోక్సభ స్థానంనుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ క్యాండిడేట్వర్ష గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు. ఇక హర్ష్వర్ధన్శ్రింగ్లా మాజీ దౌత్యవేత్త. యూఎస్, బంగ్లాదేశ్, థాయ్లాండ్ దేశాల అంబాసిడర్గా పనిచేశారు. 2023లో జరిగిన జీ20 ప్రెసిడెన్సీలో భారత చీఫ్కోఆర్డినేటర్గా వ్యవహరించారు.
కేరళకు చెందిన సి. సదానందన్ మాస్టర్ టీచర్గా పనిచేశారు. ప్రస్తుతం సోషల్వర్కర్గా, బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.1994లో సీపీఎం నేతల దాడిలో ఆయన రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేశారు. డాక్టర్మీనాక్షి జైన్.. ప్రముఖ చరిత్రకారిణి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన గార్గి కాలేజీలో హిస్టరీ అసోసియేట్ప్రొఫెసర్గా పనిచేశారు. విద్యా రంగంలో ఆమె చేసిన కృషికి 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కాగా, రాజ్యసభకు నామినేట్అయిన నలుగురికి ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు.