
పుణె: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో హర్యానా స్టీలర్స్ వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో స్టీలర్స్ 31–29 తో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. స్టీలర్స్ జట్టులో రైడర్లు విజయ్ 9 పాయింట్లు, ప్రపంజన్ 6 పాయింట్లతో రాణించగా, డిఫెండర్ మోహిత్ నందల్ ఐదు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ తరఫున రోహిత్ గులియా7 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు.