ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు ఇండియా ఫుల్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌

 ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు ఇండియా ఫుల్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌

బెంగళూరు: ఇప్పటికే సెమీస్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను ఖాయం చేసుకున్న టీమిండియా ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు రెడీ అవుతోంది. ఆదివారం నెదర్లాండ్స్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ నేపథ్యంలో బుధవారం ఫుల్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ చేసింది. ఆప్షన్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ కావడంతో కోహ్లీ, సూర్యకుమార్‌‌‌‌, షమీ, కుల్దీప్‌‌‌‌ హోటల్‌‌‌‌ రూమ్స్‌‌‌‌కు పరిమితంకాగా, మిగతా వారు నెట్స్‌‌‌‌లోకి వచ్చారు.

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన గిల్‌‌‌‌కు.. బుమ్రా, సిరాజ్‌‌‌‌, శార్దూల్​ బౌలింగ్‌‌‌‌ చేశారు. ముఖ్యంగా బుమ్రా 20 నిమిషాల పాటు చేసిన బౌలింగ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ అదరహో అనిపించింది. ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌, పేస్‌‌‌‌, స్వింగ్‌‌‌‌, స్లో, ఆఫ్ కట్టర్స్‌‌‌‌ బాల్స్‌‌‌‌తో గిల్‌‌‌‌ను ఇబ్బందిపెట్టాడు. బుమ్రా వేసిన బాల్‌‌‌‌ కడుపుకు తాకడంతో ఇషాన్‌‌‌‌ విలవిలలాడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని ప్రాక్టీస్‌‌‌‌ కొనసాగించాడు. కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, జడేజా కూడా తమ బ్యాటింగ్‌‌‌‌కు పదును పెట్టుకున్నారు.