నాల కబ్జా.. కార్పోరేటర్ కాలర్ పట్టుకుని కొట్టిన స్థానికులు

నాల కబ్జా.. కార్పోరేటర్ కాలర్ పట్టుకుని కొట్టిన స్థానికులు

భారీ వర్షాలకు ఇబ్బందులు పడుతున్న జనం ప్రజా ప్రతినిధులపై తిరగబడుతున్నారు. లేటెస్ట్ గా  హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డిపై స్థానికుల దాడి చేశారు. హయత్ నగర్ రంగానాయకుల గుట్టలో నాల భూములన్ని కబ్జాలకు గురవుతున్నాయని  ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పటించుకోలేదని  సామ తిరుమల రెడ్డిని నిలదీశారు స్థానికులు. వర్షాలకు ఇళ్ళలోకి నీరు రావడంతో ఇండ్లు మునిగిపోతున్నాయని కార్పోరేటర్ ను కొట్టారు కాలని వాసులు. చర్చి దగ్గర ఉన్న నాల కబ్జాకు గురైందని ఇన్ని రోజులుగా చెబుతుంటే.. ఎందుకు పట్టించుకోలేదని.. కార్పొరేటర్ ప్రశ్నించారు  కాలని వాసులు.