- రూ.5 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్
ఎల్బీనగర్, వెలుగు: గృహహింస కేసులో నిందితుడిగా ఉన్న ఓ హోంగార్డును కేసు నుంచి తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచన్ బాగ్ పీఎస్లో హోంగార్డుగా పనిచేస్తున్న యనమల రాముపై ఇటీవల సరూర్ నగర్ విమెన్ పీఎస్ లో గృహహింస కేసు నమోదైంది.
ఈ కేసులో తన పేరును తొలగించేందుకు విమెన్ పీఎస్లో పనిచేస్తున్న ఏఎస్సై సరళ, హెడ్ కానిస్టేబుల్ టి. నర్సింహను రాము సంప్రదించాడు. వారు రూ.5 వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం సరూర్ నగర్ విమెన్ పీఎస్లో రూ.5 వేలు తీసుకుంటున్న సరళ, నర్సింహాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.