స్కూల్ పిల్లల్ని తాళ్లతో కట్టేసిన హెడ్మాస్టర్

స్కూల్ పిల్లల్ని తాళ్లతో కట్టేసిన హెడ్మాస్టర్

అల్లరి చేస్తున్నారనే కారణంతో విద్యార్థులను క్లాస్ రూమ్ లోనే  తాళ్లతో కట్టేశారు ప్రధానోపాధ్యాయులు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలోని మశానంపేట మున్సిపల్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది.   రెండు, మూడు తరగతులలు చదువుతున్న నలుగురు విద్యార్థులను టేబుల్స్ కు తాళ్లతో కట్టేసి బంధించారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో  విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు.  ఆర్డీఓ రామసుబ్బయ్య, ఎంఈఓ చెన్నకృష్ణ విద్యార్థులను విచారించారు. అల్లరి చేస్తున్నామని తమను హెచ్ఎం కట్టేసినట్లు విద్యార్థులు చెప్పారు.