- రెండు శాతం క్లెయిమ్స్లోమోసాలు..
- అక్రమాలకు టెక్నాలజీతో చెక్పెట్టొచ్చు
- మెడి అసిస్ట్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: మోసాలు, దుర్వినియోగం, ఇతర పొరపాట్ల వల్ల ఆరోగ్య బీమా కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నట్టు వెల్లడయింది. ‘ఫ్రాడ్, వేస్ట్, అబ్యూజ్’ (ఎఫ్డబ్ల్యూఏ) కారణంగా ఏటా సుమారు రూ. వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని బీసీజీ, మెడి అసిస్ట్ రిపోర్ట్ పేర్కొంది. నకిలీ బిల్స్తో బీమా డబ్బు పొందడం, లేని రోగానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చూపించడం, ఆసుపత్రులు, డాక్టర్లు అవసరానికి మించి పరీక్షలు, చికిత్సలు చేసి అధిక బిల్లులు వేయడం వల్ల కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది.
బీమా కంపెనీల అంతర్గత విధానాల్లో లోపాల వల్ల కూడా అనవసరంగా డబ్బు ఖరవుతోంది. ఏఐ, జెన్ఏఐ ద్వారా క్లెయిమ్స్ ప్రాసెస్ చేయాలని, ఫలితంగా మోసాలు జరగకముందే గుర్తించి అడ్డుకోవచ్చని రిపోర్ట్ సూచించింది. ప్రస్తుతం ఇండియా హెల్త్ఇన్సూరెన్స్ మార్కెట్సైజు 1.27 లక్షల కోట్లు కాగా, 2030 నాటికి సుమారు 2.6–3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశ ఆరోగ్య బీమా రంగంలో మొత్తం క్లెయిమ్స్ లో 90 శాతం రిస్క్ లేనివే ఉంటున్నాయి. రెండు శాతం క్లెయిమ్స్ మాత్రమే మోసపూరితమైనవి.
