
వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంత కెరీర్కి హెల్త్ ఇష్యూస్ బ్రేక్ వేశాయి. ‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్తో బాధపడుతున్నట్టు ‘యశోద’ రిలీజ్ టైమ్లో చెప్పిన సమంత.. గత కొద్ది నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటుండడంతో పబ్లిక్లో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే సోషల్ మీడియా పోస్టులతో తిరిగి అభిమానులను పలకరించిన సమంత.. శుక్రవారం ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించింది. వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్లో ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్గా ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
లాంగ్ గ్యాప్ తర్వాత సమంత పబ్లిక్లోకి రావడంతో అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. వరుణ్ ధావన్తో కలిసి ‘సియాటెల్’ అనే హిందీ వెబ్ సిరీస్లో ఆమె నటించాల్సి ఉంది. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవనుంది. ముంబై ఎయిర్ పోర్ట్లో సమంత కనిపించడంతో ఆ ప్రాజెక్ట్ గురించే అక్కడికి వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ట్రైలర్ను ఈనెల 9న విడుదల చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఈ మూవీకి డబ్బింగ్ చెబుతున్న విషయం తెలియజేస్తూ, ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది సమంత. దీంతో సమంత ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్.