- అరుపులు, కేకలతో దద్దరిల్లిన కౌన్సిల్ హాల్
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్సిపల్ఆఫీస్ లో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశం అరుపులు, కేకలతో వాడీవేడిగా సాగింది. చైర్మన్ తూమొల్ల దత్తాత్రి అధ్యక్షతన జరిగిన సమావేశం పాలకవర్గం, ఎంఐఎం వర్గాల మధ్య వాగ్వాదం, నిలదీతలు, వాదులాటల మధ్య కొనసాగింది. తమ ఎజెండాలోని ఇండస్ట్రియల్ జోన్లోని స్థలాలను రెసిడెన్షియల్ జోన్లోకి మార్చే అంశంపై ఎంఐఎం కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. సంబంధిత అంశాన్ని రెగ్యులర్ ఎజెండాలో పొందపర్చాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను కౌన్సిలర్ల ప్రమేయం లేకుండా నిర్వహించడం సరికాదని ఆరోపిచారు.
పారిశుధ్య నిర్వాహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పాలకవర్గం, ఎంఐఎం కౌన్సిలర్ల వాగ్వాదం చెలరేగింది. పెద్దఎత్తున అరుపులు, కేకలు వినడంతో కింత అంతస్తులో ఉన్న మున్సిపల్ సిబ్బంది, అధికారులు, అంతస్తులోని కౌన్సిలర్ హాల్కు పరుగులు పెట్టారు. చర్చోపచర్చల మధ్య రెగ్యులర్ఎజెండాలోని అంశాలపై ఆమోద ముద్ర వేయగా టేబుల్ ఎజెండాలోని రెండు అంశాల్లో ఒకదాన్ని వ్యతిరేకించారు. సమావేశంలో వైస్ చైర్ పర్సన్ బీబీ ఖుతిజా సిద్ధికి, కమిషనర్ లింగయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
