ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ బీభత్సం సృష్టిస్తుండగా మరో 8 రాష్ట్రాలకు భారత వాతవారణ శాఖ అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, గోవా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది.
మరోవైపు తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.