వెలుగు, గచ్చిబౌలి/మూసాపేట/గండిపేట/అబిడ్స్: సోమవారం సాయంత్రం కురిసిన భారీ వానకు గ్రేటర్లోని మెయిన్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఐటీ కారిడార్లో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్లు ఆఫీసులు, కాలేజీల నుంచి ఇండ్లకు వెళ్లే టైమ్ కావడంతో సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఐటీ కారిడార్లోని అన్నీ మెయిన్ రోడ్లు వెహికల్స్తో నిండిపోయాయి. కి.మీ దూరానికి దాదాపు గంటకుపైగా టైమ్ పట్టింది.
బయో డైవర్సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లే దారిలో, సైబర్ టవర్స్, గచ్చిబౌలి, ఐఐఐటీ, విప్రో, లింగంపల్లి, నల్లగండ్ల, ఖాజాగూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ నెలకొంది. హైటెక్సిటీ, నానక్రాంగూడలోని ఐటీ ఎంప్లాయీస్ ఇండ్లకు చేరుకునేందుకు దాదాపు 2 నుంచి 3 గంటల టైమ్ పట్టింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, కూకట్పల్లి, సనత్నగర్, అమీర్ పేట, మెహిదీపట్నం, అశోక్నగర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, శివరాంపల్లి, ఉప్పర్పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, మణికొండ, నార్సింగి సహా సిటీ శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, వనస్థలిపురం, విజయవాడ హైవేపై వర్షపు నీరు చేరడంతో వెహికల్ మూవ్ మెంట్ స్లోగా కొనసాగింది.