తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.  వర్షం కారణంగా భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీవారి  దర్శనానికి వెల్లే భక్తులతో పాటు, దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్న భక్తులు వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీశారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్రవస్థలు పడ్డారు.  షాపింగ్ కాంప్లెక్స్, లోతట్టు ప్రాంతాలలోని దుఖానాలలోకి వర్షపు నీరు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి.

మరోవైపు తిరుమలలో గత నాలుగు  రోజులుగా వాతావరణం మారిపోయింది. ఓ పక్క  ఉదయం ఎండలు మండిపోతుండగా సాయంత్రానికి హఠాత్తుగా ఉరుములు, మెరుపులో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి ఉక్కపోతలతో అల్లాడిన భక్తులు వర్షంతో వాతావరణం చల్లబడదడంతో సేద తీరుతున్నారు. మొదటి, రెండో ఘాట్ రోడ్లలలో వర్షం కారణంగా అక్కడక్కడ  కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉంది. దీంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.