గుజరాత్ ను ముంచెత్తిన భారీ వర్షాలు

గుజరాత్ ను ముంచెత్తిన భారీ వర్షాలు

భారీగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్  రాష్ట్రం నీటమునిగింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని వడోదర జలమయమైంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఒక్క రోజులోనే 12 మంది చనిపోయారు. భారీ వర్షాల కారణంగా నీరు ప్రవేశించడంతో వడోదర విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పరిస్థితిని సమీక్షించిన ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ…ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.  పాఠశాలలకు ఇవాళ(గురువారం) సెలవు ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం.

వడోదర నగరంతోపాటు వల్సాద్‌, బహరుచ్‌, నవసారి, తాపి , బానసకాంత, పటాన్‌ జిల్లాల్లో శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ  హెచ్చరించింది. హరిద్వార్‌ మెయిల్‌, ప్రేరణ ఎక్స్ ప్రెస్‌, ముంబై -అహ్మదాబాద్‌ లోక్ శక్తి ఎక్స్ ప్రెస్‌, జంబూసర్‌-ప్రతాప్ నగర్‌ ప్యాసింజర్, వడోదర ప్యాసింజర్, ఆనంద్‌ బహరుచ్‌ రైళ్లు సహా పలు రైళ్లను రద్దు చేశారు.