తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఏకంగా 53,101 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,843 మంది స్వామికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు వచ్చింది. ఇక టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మరోవైపు కంపార్టమెంట్లలో వేచివున్న భక్తులను సమయానుసారంగా శ్రీవారి దర్శనానికి పంపిస్తున్నారు.