ముందు వరద బాధితులను ఆదుకోండి

ముందు వరద బాధితులను ఆదుకోండి
  • కేబినెట్ నిర్ణయాలపై సంబురాలేంది?: వైఎస్ షర్మిల

హైదరాబాద్, వెలుగు: సాయం అందక వరద బాధి తులు చస్తుంటే, కేబినెట్ నిర్ణయాలపై సంబురాలేందని షర్మిల ప్రశ్నించారు. వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే, వర్షాలకు ఇండ్లు దెబ్బతింటే  మీకు సంతోషమా అని ఆమె బుధవారం ట్వీట్​లో ప్రశ్నించారు. వర్షాలతో రైతులకు రూ.2 వేల కోట్ల నష్టం జరిగిందని షర్మిల తెలిపారు. నిరు ద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం రాలేదని.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పంట బీమా స్కీమ్​ అమలు కావడంలేదని వివరించారు. ప్రజలను దగా చేసిన చరిత్ర కేసీఆర్ దని షర్మిల ఫైర్ అయ్యారు.