ఆసియా దేశాలలో మాంసం కోసం ఏడాదికి 30 మిలియన్ కుక్కల్ని చంపుతున్నరు

ఆసియా దేశాలలో మాంసం కోసం ఏడాదికి 30 మిలియన్ కుక్కల్ని చంపుతున్నరు

భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలు మాంసాహారాన్ని తింటారు. ఆసియా, ఐరోపాలోని దేశాలు మాంసాహారానికి ప్రసిద్ధి చెందాయి. కానీ ఒక దేశంలో మాత్రం పెంపుడు కుక్కలు, పిల్లులను తినడం పాత కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడి ప్రజలు సంవత్సరం మొత్తం కలిపి 40 లక్షల పిల్లులను తింటారు. కుక్క మాంసంతో విందు చేసుకుంటారు. ఈ సంప్రదాయాన్ని నిషేధించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

కరోనా మహమ్మారి తర్వాత కొన్ని నెలల క్రితం వరకు చైనాలోని షెన్‌జెన్ నగరంలో కుక్క, పిల్లి మాంసం తినడంపై నిషేధం విధించారు. దానిని  చైనాలో అమలు చేసిన మొదటి నగరం ఇదే. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ప్రకారం, ఆసియా దేశాలలో మాంసం కోసం ప్రతి సంవత్సరం 30 మిలియన్ కుక్కలను చంపుతున్నారు. ఒక్క చైనాలోనే ఏటా కోటి కుక్కలు, 40 లక్షల పిల్లులు చచ్చిపోతున్నాయి. ఈ జంతువులలో ఎక్కువ భాగం పెంపుడు జంతువులే కావడం గమనార్హం. వీటిని దొంగిలించి విక్రయిస్తారు. ఆ తర్వాత వాటిని బోనుల్లో ఉంచి చంపేస్తారు.

డాగ్ మీట్ ఫెస్టివల్..

చైనాలో కుక్కలను పెంపుడు జంతువులుగా ఉన్నప్పటికీ వాటిని తినే సంప్రదాయం వేల సంవత్సరాల నాటిది. ప్రతి సంవత్సరం జూన్‌లో, దక్షిణ చైనాలోని యులిన్ నగరంలో డాగ్ మీట్ ఫెస్టివల్ జరుగుతుంది, ఇక్కడ కుక్కలు, పిల్లులను ఆహారం కోసం ప్రత్యేకంగా విక్రయిస్తారు. ఇక్కడ 10 వేల నుంచి 15వేల వరకు  కుక్కలను చంపి తింటారనే అంచనా ఉంది. వేసవిలో కుక్క మాంసం తినడం వల్ల శరీరంలో ఏర్పడే వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. గత కొన్నేళ్లుగా జంతు సంరక్షణకు సంబంధించిన పలు సంస్థలు దీనిపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నాయి. దీంతో ప్రస్తుతం కొంత తగ్గుదల కనిపిస్తోంది.

 దక్షిణ కొరియాలో కుక్క మాంసం వంటకాలు చాలా సాధారణం. వాటిని  gegogi అని పిలుస్తూ ఉంటారు. హ్యూమన్ సొసైటీ ప్రకారం, అక్కడ దాదాపు17వేల కుక్కల పొలాలు ఉన్నాయి. ఇక్కడి జంతువులు సాధారణంగా మానవ వినియోగం కోసం తయారు చేయబడతాయి. తైవాన్‌లో కుక్కలు, పిల్లులను తినడం సాధారణం.  గతంలో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. కొత్త జంతు సంరక్షణ చట్టం ప్రకారం, అక్కడ జంతువులను అమ్మినా, తిన్నా లేదా కొన్నా 6,500 పౌండ్ల వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. జంతు హింసకు పాల్పడిన వారికి 52వేల డాలర్ల వరకు భారీ జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించనున్నారు.