కల నిజమైంది అంటున్న ప్రభాస్

కల నిజమైంది అంటున్న ప్రభాస్

ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కలవాలని, కనీసం ఒక్కసారి చూడాలని అభిమానులంతా కలలు కంటుంటారు. అలాగే ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీ ఓ కల ఉంది. లెజెండరీ యాక్టర్ అమితాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించాలని. ఆ కల ఇప్పుడు నిజమైంది. నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశ్విన్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. దీపికా పదుకొనె హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. 
శుక్రవారం ప్రభాస్, బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీలపై సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని షూట్ చేశారు. దాంతో ప్రభాస్ చాలా సంతోషపడిపోయాడు. ‘నా కల నిజమైంది. అమితాబ్ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇవాళ మొదటి షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేశాను. చాలా సంతోషంగా ఉంది’ అంటూ సోషల్‌ మీడియాలో సంతోషాన్ని పంచుకున్నాడు. ప్రభాస్‌తో యాక్ట్ చేయడం హ్యాపీగా ఉందని అమితాబ్ కూడా ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే ‘ఆదిపురుష్’ షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కంప్లీట్ చేశాడు ప్రభాస్. ‘సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కూడా చివరి దశకు చేరుకుంది. దాంతో ఇక ‘ప్రాజెక్ట్ కె’పై దృష్టి పెడుతున్నాడు.