సంప్రదాయ పంచె కట్టులో .. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్

సంప్రదాయ పంచె కట్టులో ..   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు.. 2023 జూన్ 06 మంగళవారం వేకువజామున  సంప్రదాయ పంచె కట్టులో శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు.  ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం‌ పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనం ఆనంతరం..   రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు ప్రభాస్ ను  సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను  అందజేశారు.  అనంతరం ప్రభాస్ గెస్ట్ హౌజ్ కు రాగా ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.  అతికష్టం మీద పోలీసులు ప్రభాస్ ను అక్కడినుంచి పంపించారు.  

తిరుమలలో ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్

2023 జూన్ 06 మంగళవారం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగే ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు  త్రిదండి చిన్న జీయర్ స్వామి చీఫ్ గెస్టుగా హాజరు అవుతున్నారు. ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసమే చిత్రం యూనిట్ రెండున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందట. ఇక  ఎటూ తిరుమలలో చూసినా ప్రభాస్ బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు కనిపిస్తోన్నాయి. రామబాణాన్ని ఎక్కు పెట్టిన శ్రీరాముడి గెటప్‌లో ఉన్న నిలువెత్తు కటౌట్లను ఏర్పాటు చేశారు అభిమానులు. 

జూన్ 16న ప్రేక్షకుల ముందుకు 

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల నడుమ 2023 జూన్16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.  తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.  ఇందులో   శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించగాలక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే కనిపించనున్నారు.  ఓం రౌత్ దర్శకత్వంలో సుమారుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో  ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు.