ముంబైలో రామ్ చరణ్.. ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

ముంబైలో రామ్ చరణ్.. ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

గ్లోబల్ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) ముంబై (Mumbai) వెళ్లారు. అక్కడి ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌ను శాలువాతో సత్కరించారు ఆలయ పూజారులు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రామ్ చరణ్ ముంబై ఎందుకు వెళ్లారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. 

Also Read :-మెగాస్టార్తో త్రివిక్రమ్..

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game changer) సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara adwani) హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు రామ్ చరణ్. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.