గ్లోబల్ స్టార్ రామ్చరణ్ (Ram Charan) ముంబై (Mumbai) వెళ్లారు. అక్కడి ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ను శాలువాతో సత్కరించారు ఆలయ పూజారులు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రామ్ చరణ్ ముంబై ఎందుకు వెళ్లారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.
#RamCharan from Siddhi Vinayak temple
— LetsOTT (@Ietsott) October 4, 2023
Show me more spiritual star than him ? pic.twitter.com/K79KTKKLiT
Also Read :-మెగాస్టార్తో త్రివిక్రమ్..
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game changer) సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara adwani) హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు రామ్ చరణ్. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.