మెగాస్టార్తో త్రివిక్రమ్.. ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాకు సీక్వెల్

మెగాస్టార్తో త్రివిక్రమ్.. ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాకు సీక్వెల్

మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi), త్రివిక్రమ్(Trivikram) కాంబో సెట్ అయిందా? చిరు కెరీర్ ను మలుపుతిప్పిన ఆ సినిమాకు సీక్వెల్ రానుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించే చర్చ నడుస్తోంది. ఈ కాంబోలో ఇప్పటికే జై చిరంజీవ(Jai chiranjeeva) సినిమా వచ్చింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. అప్పటి నుండి ఈ కాంబోలో సినిమాపై వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ కాంబో తెరపైకి వచ్చింది. 

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్టు ను నిర్మించానుందని సమాచారం. అయితే ఇక్కడ అసలు విశేషం ఎంటటే.. ఈ క్రేజీ కాంబోలో కోసం చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఖైదీ సినిమాకు సీక్వెల్ చేయనున్నారట. 1983లో విడుదలైన ఆ సినిమా.. చిరు కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా క్లైమాక్స్ లో చిరు.. పగ తీర్చుకోవడం కోసం ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరోజన్మ ఎత్తుతాను.. అప్పుడు కలుసుకుందాం.. అని హీరోయిన్ తో ఓ డైలాగ్ చెప్తారు. అక్కడితో సినిమా పూర్తి అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకొని సీక్వెల్ కథను డెవలప్ చేశారట త్రివిక్రమ్. కథ ఇప్పటికే పూర్తయిందని, దీనిపై చర్చలు కూడా జరిగాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుందని సంచారం. ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read :- రతిక లాంటి అమ్మాయితో పెళ్లి.. ఎందుకమ్మా నామీద నీకంత పగ

ఇక చిరు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. బింబిసార దర్శకుడు వశిష్టతో మెగా 157 మూవీ చేస్తున్నారు చిరు. ఈ మధ్యే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సోషియో ఫాంటసి ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.