‘బంఫర్ ఆఫర్’ తర్వాత తన బాడీలాంగ్వేజ్కి తగ్గట్లు ఉండే చిత్రం ‘వెయ్ దరువెయ్’ అన్నాడు సాయిరామ్ శంకర్. తను హీరోగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన ఈ సినిమా ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ‘సమాజంలో ఓ సమస్యపై హీరో చేసే చిన్నపాటి పోరాటమే ఈ చిత్రం. ఇందులో 80 శాతం కామెడీ, మిగతాది ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఉంటుంది. నా క్యారెక్టర్ చాలా జోవియల్గా ఉంటుంది.
ఈ మూవీ షూటింగ్ను కేవలం 35 రోజుల్లోనే పూర్తి చేశాం. దీనికి దర్శక నిర్మాతల పర్ఫెక్ట్ ప్లానింగే కారణం. ఆడియెన్స్ను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది. ఇది నా టేకాఫ్కి ఉపయోగపడే సినిమా అవుతుందనిపిస్తుంది. హీరోయిన్ యషా ఇందులో మంచి రోల్ చేసింది. ఇద్దరం యాటిట్యూడ్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాం. హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్లో కనిపిస్తారు. అలాగే సత్యం రాజేష్, సునీల్, చమ్మక్ చంద్ర, థర్టీ ఇయర్స్ పృథ్వీ, పోసాని, అదుర్స్ రఘు, కాశీ విశ్వనాథ్ అందరూ తమదైన నటనతో మెప్పిస్తారు.
భీమ్స్ మంచి సాంగ్సే కాదు.. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించారు. ఇక కొంత గ్యాప్ వచ్చినా.. నటించిన సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో ‘ఒక పథకం ప్రకారం’, మే నెలలో ‘రీసౌండ్’ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. అలాగే బంపర్ ఆఫర్2 కూడా ఉంటుంది’ అని చెప్పాడు.