శ్రీదేవి పేరుతో సేవలు : వేలంలో ఆమె చీరకు రూ.1.30 లక్షలు

శ్రీదేవి పేరుతో సేవలు : వేలంలో ఆమె చీరకు రూ.1.30 లక్షలు

అతిలోక సుందరి శ్రీదేవి మరణించిన ఆమెపై అభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు ఫ్యాన్స్. తమిళం, తెలుగు, హిందీ అంటూ భారతీయ సినిమాలో అగ్రనటిగా, అతిలోక సుందరిగా వెలిగిన నటి శ్రీదేవి. అలాంటి శ్రీదేవి గత ఏడాది దుబాయిలో అకాలమరణానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ధరించిన ఖరీదైన చీరలను వేలం వేసి అలా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సేవా సంస్థలకు అందించాలని శ్రీదేవి కుటుంబసభ్యులు భావించారు. అలా శ్రీదేవి చీరల వేలానికి సోషల్ మీడియాను వారు ఎంచుకున్నారు. శ్రీదేవికి చెందిన ఒక ఖరీదైన చీరకు ముందుగా రూ. 40 వేలను నిర్ణయించారు. అది ఆన్‌ లైన్‌ వేలంలో రూ. 1.30 లక్షల ధర పలికింది.

ఈ మొత్తాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్‌ కన్‌ సర్న్‌ ఇండియా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అందించనున్నట్లు తెలిసింది. డబ్బుతో ఆసరా లేని మహిళలు, అనాథ బాలలు, వృద్ధుల సంక్షేమానికి ఉపయోగిస్తామని తెలిపారు. శ్రీదేవి పేరుతో ఇప్పటే పలు సేవలు చేస్తున్నామన్నారు. ఇకమీదట ఇలాంటి మంచి పనులు మరిన్ని చేస్తామన్నారు. అయితే.. శ్రీదేవిపై అభిమానంతోనే అంత డబ్బుపెట్టామని తెలిపారు వేలంలో చీరను కొన్నవారు.