తిరుమలలో హై అలెర్ట్ 

తిరుమలలో హై అలెర్ట్ 

తిరుమలలో హై అలెర్ట్ ప్రకటించారు. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు email ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే.. ఎలాంటి సంచారం లేదని భద్రతాధికారులు గుర్తించారు. మెయిల్ పంపిన వ్యక్తులపై భదత్రాధికారులు నిఘా పెట్టారు. మెయిల్ ఎక్కడి నుంచి పంపించారు..? ఎవరు పంపించారు..? అనే కోణాల్లో ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.