317జీవోపై స్టేకు నిరాకరించిన హైకోర్టు

317జీవోపై స్టేకు నిరాకరించిన హైకోర్టు

హైదరాబాద్: ఉద్యోగులు, టీచర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 317 జీవోపై స్టే విధించేందుకు హైకోర్టు మరోసారి నిరాకరించింది. 317 జీవో ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటీషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ ఏజీ.. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిటీషన్లోని అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టీచర్ల కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.

ఆన్లైన్లో పెళ్లి.. అతిధుల ఇంటికే భోజనం..

టెస్టు కెప్టెన్సీపై మనసులోమాట బయట పెట్టిన రాహుల్