మియాపూర్, వెలుగు: ఓ కేసు విషయంలో సరైన దర్యాప్తు చేపట్టకపోవడంతో మియాపూర్ ఇన్స్పెక్టర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 29న హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2024లో మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ యువతి తన తండ్రిపై ఫిర్యాదు చేయగా, అప్పటి మియాపూర్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ పోక్సో కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో యువతి తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత యువతి తండ్రి.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ తన కుమార్తెపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై మియాపూర్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేయకపోవడంతో.. బాధితుడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి... మియాపూర్ ఇన్స్పెక్టర్ విచారణకు నేరుగా హాజరై కేసుకు సంబంధించిన వివరాలను చెప్పాలని ఆదేశించారు.
