రేవంత్ కు వివరాలివ్వడానికి అభ్యంతరం ఏంటి..?: హైకోర్టు

రేవంత్ కు వివరాలివ్వడానికి అభ్యంతరం ఏంటి..?: హైకోర్టు
  • ఓఆర్​ఆర్​ టెండర్ల పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

ఓఆర్​ఆర్​టెండర్ల వివరాలు అడిగితే ఓ ఎంపీకి ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీఐ ఉన్నది ఎందుకని.. ప్రతిపక్షాలకు డీటెల్స్ ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

AsloRead: సర్వం కోల్పోయిన మోరంచపల్లి గ్రామస్తులు.. కట్టేసిన పశువులు అలాగే చనిపోయాయి

ఓఆర్​ఆర్​టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వివరాలు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆర్టీఐ ని కోరారు. అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతో.. రేవంత్​హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన పిటిషన్​ని స్వీకరించిన కోర్టు జులై 28న ఈ వ్యాఖ్యలు చేసింది.  

ఒక ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో ఆయనకు ఓఆర్​ఆర్​డీటెల్స్ అన్ని సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు ఆదేశాలు పాటిస్తామని తెలిపారు.