
హైదరాబాద్, వెలుగు : మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం అమలు తీరు గురించి వివరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మానవ అక్రమ రవాణకు గురైన మహిళలను, బాలలను రక్షించాక.. వాళ్లను సేఫ్ హౌస్ల తరలింపునకు గైడ్లైన్స్ విషయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. విచారణను జులై 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సూరేపల్లి నంద ప్రకటించారు. ప్రజ్జ్వల స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది.